నకిరేకల్ : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 200 మంది యువజన కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి ఆదివారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(MLA Chirumurthy )సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం నార్కట్ పల్లి మండలం గోపాలాయపల్లి గ్రామానికి చెందిన 20 కుటుంబాలు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సంక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలతో ప్రజలను పక్కదారి పట్టిస్తుందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ మూడో సారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అందరూ కలిసికట్టుగా బీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.