జనగామ : జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతూనే ఉంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli)కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నది. బీఆర్ఎస్ వెంటే ఉంటామంటూ స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. తాజాగా దేవరుప్పుల మండలం, కామారెడ్డి గూడెం రజక సంఘం సభ్యులు బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. అలాగే పాలకుర్తి నియోజకవర్గం, తొర్రూరు మండలం, వెలికట్టె గ్రామానికి చెందిన యువకులు బీఆర్ఎస్లో చేరారు. ఆయా కార్యక్రమాల్లో రెడ్డిరాజుల నర్సయ్య, దీకొండ సంతోష్ , తదితరులు పాల్గొన్నారు.