నల్లగొండ : బీఆర్ఎస్తోనే పేద ప్రజలకు మేలు జరుగుతుంది అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్(MLA Ravindra Kumar) పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొండమల్లేపల్లి పట్టణానికి చెందిన బీజేపీ పార్టీ నుంచి 50మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలను కప్పి ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తమ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమన్నారు.
గులాబీ జెండాతో తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ప్రతి కార్యకర్త కుటుంబానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తున్నదని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో రూ.100 చెల్లించి క్రియాశీలక సభ్యత్వం పొంది మృతిచెందిన కార్యకర్త కుటుంబానికి రూ.2 లక్షలు అందజేస్తున్నామని విరించారు.
ఈ కార్యక్రమంలో రైతు బంధు అధ్యక్షుడు కేసాని లింగా రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమావత్ దాస్రు, మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, ఉప సర్పంచ్ గంధం సురేష్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎలిమినేటి సాయి, అబ్బనబోయిన శ్రీను, కోడిదాల వెంకటయ్య, బొడ్డుపల్లి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.