నల్లగొండ : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ నియోజకవర్గం కేతపల్లి మండలం బండపాలెం గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఎనిమిదేండ్లుగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చురుకుగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని వెల్లడించారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో మారం మీనా రెడ్డి, దుదిపాల సాగర్ రెడ్డి, వంగూరి యేసు, అరుణ్ కుమార్, ప్రశాంత్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
క్యాంపు కార్యాలయంలో నకిరేకల్ పట్టణానికి చెందిన లబ్ధిదారులకు నూతన పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం పెన్షన్ అందజేస్తుందన్నారు. నియోజకవర్గంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రాజకీయాల కతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.