నెక్కొండ, సెప్టెంబర్1 : బీఆర్ఎస్లోకి వలసల పర్వం వెల్లువలా కొనసాగుతున్నాయి. అన్ని పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు గులాబీ తీర్థం పుచ్చుకుండటంతో ప్రతిపక్షాలు బేజారవుతున్నాయి. తాజాగా
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగారం గ్రామస్తులంతా గులాబీ గూటికి చేరారు. కాంగ్రెస్, బీజేపీకి చెందిన ముఖ్య నాయకులు, మాజీ సర్పంచ్, నలుగురు వార్డుమెంబర్లు, వందకుపైగా కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరాయి. దీంతో ప్రతిపక్షం లేని గ్రామంగా నాగారం నిలిచింది.
పార్టీలో చేరిన వారికి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధికి పట్టం కడుతూ నాయకులంతా ఐక్యంగా కలిసి వచ్చారని అన్నారు. అన్ని గ్రామాలు ఇదే స్ఫూర్తితో ఒకే కట్టుపైకి నిలబడి రావాలని ఎమ్మెల్యే కోరారు. సీఎం కేసీఆర్ పాలనలో అమలవుతున్న అన్ని పథకాలు అందరికి వస్తున్నందు న అందరూ ఏకం కావాలన్నారు.
దళితబంధు, దళితులకు మూడెకరాల భూపంపిణీ, వట్టెవాగుపై బ్రిడ్జి, సీసీరోడ్ల నిర్మాణం, గ్రామం చుట్టూ రోడ్ల అభివృద్ధి ఇలా నాగారం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న,ఎంపీపీ జాటోత్ రమేశ్, జెడ్పీసీ లావుడ్య సరోజ హరికిషన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్యతోపాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి వార్డు మెంబర్ నాంపల్లి శ్రీను, రేబల్లి లోకేష్, ఉండ్రాతి వెంకన్న, రామడుగు రాజు, మద్దెబోయిన అశోక్, బోళ్ల యాకయ్య, యలగందుల సోమయ్య, గాడ్ల చిన్నబాలయ్య , ఉప్పలి భద్రయ్య, పోతరాజు చేరాలు, మల్లంశ్రీను, పొనకంటి రాజు, నాంపల్లి రాంచంద్రు, రాజు, ఎండీ సహీరా, గండ్ల భిక్షపతితో పాటు పలు కుటుంబాలు బీఆర్ఎస్లో చేరాయి. అలాగే బీజేపీ నుంచి మాజీ సర్పంచ్ శీలం వెంకన్న, వార్డు సభ్యులు సువర్ణ, సుజాతాముఖేశ్, చెంచు వెంకటలక్ష్మి, అటిక కట్టయ్య, బొడ్డు వీరస్వామి, చెందు సుధాకర్, దారపు వెంకటేశ్తోపాటు పలువురు బీఆర్ఎస్లో చేరారు.