సూర్యాపేట : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని హుజుర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి(MLA Saidireddy) అన్నారు. శుక్రవారం గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామానికి చెందిన సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు కేశబోయిన కృష్ణయ్య తన అనుచరులు, గ్రామానికి చెందిన పలు కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ..ఎమ్మెల్యే సైదిరెడ్డి అందరిని నవ్వుతూ పలకరిస్తారని, ప్రతి ఒక్కరితో ప్రేమ పేర్వకంగా ఉంటారన్నారు. హుజుర్ నగర్ అభివృద్ధి ఆయనతోనే సాధ్యమని బీఆర్ఎస్ పార్టీలో చేరామన్నారు. పార్టీలో చేరిన వారిలో లింగమ్మ, కేశబోయిన ముత్తయ్య, ఉమ, కేశబోయిన రవి, నాగేంద్ర, తదితరులు ఉన్నారు.