నల్లగొండ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు తాజాగా జిల్లాలోని కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన 100 మంది పవర్ యూత్ సభ్యులు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో సీఎంకేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధిని మెచ్చే బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు.
పార్టీలో చేరిన వారిలో తండు వెంకటేష్, పోరేండ్ల కాశయ్య, మారుపాక శివ ప్రసాద్, నిమ్మనగోటి నాగరాజు, రాచకొండ సతీష్, జూలూరి సైదులు, జూలూరి ఉపేందర్, చిట్టిమల్ల మహేష్, పోరేండ్ల రాజేందర్, రాచకొండ సాయి, తండు అశోక్, నారగోని అభినయ్, అల్దాస్ శ్రవణ్, తండు రాకేష్, కోడూరు పవన్, గోలి నాగరాజు, దత్సల శ్రీను తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, జెడ్పీటీసీ బొప్పాని స్వర్ణలత సురేష్, మండల పార్టీ అధ్యక్షుడు మారం వెంకట్ రెడ్డి, సర్పంచ్ జానకి రాములు, గ్రామా శాఖ అధ్యక్షుడు రాచకొండ సైదులు, ఉప సర్పంచ్ రాములు, రైతు సమన్వయ సమితి డైరెక్టర్ మునగ లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు.