నల్లగొండ : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా కేతపల్లి మండలం కొండకింది గూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(MLA Chirumurthy) సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలన్నారు.
పార్టీలో చేరిన వారిలో నర్సింగ్ నాగయ్య, టంగుటూరి రవి, టంగుతురి శ్రీను, బెజవాడ వెంకన్న, బెజవాడ బుచ్చయ్య, నర్సింగ్ భిక్షమయ్య నర్సింగ్ సైదులు, గరిక వెంకన్న, నర్సింగ్ సతీష్, రాచకొండ సైదులు, బెజవాడ లింగయ్య, పెద్ది నాగులు, పోగుల నాగయ్య, పుట్ట సైదులు, తదితరులున్నరు. ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మారం వెంకట్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, బంటు మహేందర్, బొప్పని సురేష్, బొజ్జ అరవింద్, సర్పంచ్ గోలి మంజుల వేణు మాధవ రెడ్డి, ఉప సర్పంచ్ పెరిక ప్రభాకర్, తదతరులు పాల్గొన్నారు.