నిజామాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా డిచ్పల్లి మండలం గొల్లపల్లి, నిజామాబాద్ రూరల్ మండలం జలాల్పూర్ గ్రామాలకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారికి సముచిత గౌరవం ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ దార్శనిక పాలనతో ప్రతి పల్లెకూ అభివృద్ధి ఫలాలు, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నాని చెప్పారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు.
బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు సుమలత, బాజిరెడ్డి జగన్మోహన్, కేసీఆర్ సేవాదళ్ కన్వీనర్ కొర్వా దేవేందర్, గొల్లపల్లి సర్పంచ్ లింగం యాదవ్, ఫ్రెండ్స్ యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.