వేల్పూర్ : సీఎం కేసీఆర్(CM KCR) జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి వెల్లువలా బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తొర్తి గ్రామం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు దొన్పాల్ గణేష్, కాంగ్రెస్, బీఎస్పీ కార్యకర్తలు..తడపాకల్ గ్రామం నుంచి బీజేపీ, బీఎస్పీ నుంచి యువజన సభ్యులు, భీంగల్ మండలం బెజ్జోరా గ్రామం నుంచి 25 మంది యువజన సంఘాల సభ్యులు,మోర్తాడ్ మండలం షెట్పల్లి గ్రామం నుంచి పలువురు కాంగ్రెస్ యువకులు, వేల్పూర్ మండలం లక్కొర గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నేతలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula) సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
అలాగే బాల్కొండ నియోజకవర్గం నలుమూలల అన్ని గ్రామాల నుంచి మంత్రి వేములకు ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తున్నది. పలు కుల సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. అందులో భాగంగా.. మోర్తాడ్ మండలం ఓడ్యాట్ గ్రామానికి చెందిన గొల్ల యాదవ సంఘ సభ్యులు 25 కుటుంబాలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అభివృద్ధి ప్రదాత వేముల ప్రశాంత్ రెడ్డికే మా ఓటు అంటూ సంఘం నేతలు ముక్త కంఠంతో నినదించారు. పలు సంఘాలు తనకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేయడం పట్ల మంత్రి వేముల కృతజ్ఞతలు తెలిపారు.