ఆర్కేపురం, నవంబర్ 19 : కాంగ్రెస్, బీజేపీని నమ్మితే మోసపోతామని మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి సబితాఇంద్రారెడ్డి( Minister Sabitha Indra Reddy) అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా ఆర్కేపురం డివిజన్ హరిపురి కాలనీకి చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి సబితాఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పదేళ్ల కాలంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రజలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ని గెలిపిస్తేనే బతుకులు బాగుంటాయని పేర్కొన్నారు. నియోజకవర్గంలో నిరంతర అభివృద్ధి కొనసాగాలంటే 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటెసి తనను గెలిపించాలని కోరారు.
ఈ అయిదు సంవత్సరాల కాలంలో ప్రజల ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. అభివృద్ధి విషయంలో రాజీపడకుండా సీఎం కేసీఆర్తో మాట్లాడి నిధుల కోరతలేకుండాచూశామని వివరించారు. మరింత అభివృద్ధి కోసం మరోసారి తనను ఆశీర్వదించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోమురుకుంట్ల అరవింద్శర్మ, గొడుగు శ్రీనివాస్ముదిరాజ్, తదితరులు ఉన్నారు.