జగిత్యాల : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారు. తాజాగా ధర్మపురి మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన జువ్వాడి అశోక్ రావు ఆధ్వర్యంలో వంద మంది సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula )సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా యన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీలేదన్నారు. కాంగ్రెస్ను గెలిపిస్తే మళ్లీ రాష్ట్రంలో కరెంట్ కోతలు తప్పవన్నారు. రాష్ట్రలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.