నిర్మల్, అక్టోబర్ 31: నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ సారధ్యంలోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి కాంగ్రెస్, బీజేపీ నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరుతున్నారు. మంగళవారం సోన్ మండలం కడ్తాల్ గ్రామానికి చెందిన యువసేన యూత్, రెబల్ స్టార్ యూత్, గరుడ యూత్, హల్ చల్ యూత్, శ్రీరామ్ యూత్, రెబల్ యూత్తో పాటు కాంగ్రెస్, బీజేపీకి చెందిన మహిళలు100 మంది మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy )సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
మామాడ మండలం పులిమగుడుగు గ్రామం, నిర్మల్ పట్టణంలోని మహాలక్ష్మి వాడకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు గులాబీ జెండాకు జై కొట్టారు. వీరందరికీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజల సమస్యమల పరిష్కారమే ప్రధాన ఎజెండగా పని చేస్తున్నామన్నారు.
అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల్లో ఎలాంటి కుట్రలు చేస్తున్నాయో ప్రజలు గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయడు సత్యనారాయణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.