కరీంనగర్ : తెలంగాణలోప్రతిపక్ష స్థానం కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోటీపడుతున్నాయని, కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. శుక్రవారం కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలోని శాంతినగర్కు చెందిన 8వ వార్డు సభ్యుడు సుజాతతో సహా బీజేపీ, కాంగ్రెస్ కు చెందిన యువకులు పెద్ద ఎత్తున మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.మళ్లీ మూడోసారి అధికారంలోకి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. దొంగ హామీలతో ప్రజలను మోసం చెయ్యడం కాంగ్రెస్ పార్టీ నైజం అని, 60 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. ఈ ఎన్నికలలో ఒక్క అవకాశం ఇవ్వమని కాంగ్రెస్ నాయకులు కోరడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో కరంటు కోతలతో రైతులు సాగు చేసిన పంటలు కండ్ల ముందు ఎండిపోతుంటే రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయన్నారు.
లంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, పంటలకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వడంతో రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బూస సందీప్, రాజు, రాచకొండ భూమేష్, సయ్యద్ రఫీక్, వజీర్, రుద్రాక్ష సాయి, వనపర్తి రాజు, శంకర్ తరాల, బొంగాని సాయి గౌడ్, ఆకుల మధు, శేఖర్, బొలవేణి దిలీప్, కుంభం క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.