జోగులాంబ గద్వాల : జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి(Patel Prabhakar Reddy)తో పాటు గద్వాల్ మండల పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. వారికి గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పటేల్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీని కష్టకాలంలో ఆదుకుంటే తమ గుర్తింపు ఇవ్వకుండా ప్యారాచూట్ నాయకులకు గద్వాల టికెట్ కేటాయించి తమను అవమా నపరిచారన్నారు. అందుకోసం పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల నియోజకవర్గ ఇంచార్జ్ రాకేష్, తదితరులు ఉన్నారు.