మహబూబ్ నగర్ : పాలమూరు బిడ్డలు మట్టి మోసే లేబర్ స్థాయి నుంచి నేడు ఐటీ ఉద్యోగులు సాధించే దాకా ఎదిగారు. ఇది మరిచిపోలేని రోజు. మన పిల్లలు ఇక్కడే చదివి.. ఇక్కడే ఉద్యోగం చేసే అవకాశం బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఈ నెల 9వ తేదీన జిల్లా పరిషత్ గ్రౌండ్ లో TASK నేతృత్వంలో జాబ్ మేళా ఉంటుదని ఆయన తెలిపారు.
మహబూబ్నగర్లోని ఐటీ టవర్లో ఉన్న కంపెనీలకు ఐటీ ఉద్యోగుల కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారని, లోకల్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుదని పేర్కొన్నారు. పది కంపెనీల్లో ఈ ఉద్యోగాలు ఉంటాయి. మొదటి దశలో 650 ఉద్యోగాలు ఇస్తారు. ఎక్కడికో వెళ్లకుండా ఇక్కడే.. ఉన్న చోటనే ఉద్యోగం రావడం అదృష్టమన్నిరు.
ఇది ప్రారంభం మాత్రమే.. త్వరలోనే అమర్ రాజా కంపెనీ కూడా ప్రారంభం అవుతుంది. హన్వాడలో ఫుడ్ పార్కు వస్తుంది. గతంలోని పాలకులు టైమ్ పాస్ చేశారు. చేసింది శూన్యం. ఇపుడు మెట్రో రైలు షాద్ నగర్ వరకు వస్తుందని చెప్పారు. అలాగే మహబూబ్ నగర్ త్వరలోనే కార్పొరేషన్ అవుతుందని, ఐటీ టవర్ నుంచి బై పాస్ కు వంద ఫీట్ల రోడ్ కూడా వస్తుందని చెప్పారు. ఇక్కడి నుంచి Air Port కు గంటలోపే వెళ్లే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు.
భవిష్యత్ మహబూబ్ నగర్ అనేది చాలా అద్భుతంగా వుంటుంది. అందుకు ..అందరూ సహకరించాలి. ఇది మన నగరం.. మన పిల్లల భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలునిచ్చారు. ఇలాంటి ప్రశాంత వాతావరణం ఎవరూ పాడు చేయవద్దు. అలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని బహిష్కరిస్తామని హెచ్చరించారు.