హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూలో పీహెచ్డీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రిసెర్చ్ రివ్యూ మీటింగ్ (ఆర్ఆర్ఎం) ఏర్పాటు చేస్తూ వర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. విద్యార్థుల కోసం వచ్చే డిసెంబర్ 21 నుంచి 23 వరకు ఆర్ఆర్ఎంను నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
ఇందుకు విద్యార్థులు డిసెంబర్ 12 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.jntuh.ac.in వెబ్సైట్ లేదా 9154089525 నంబర్ను సంప్రదించాలని సూచించారు.