హాజరు తప్పనిసరి: జేఎన్టీయూ హైదరాబాద్
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 30 : పీహెచ్డీ విద్యార్థులకు జేఎన్టీయూ హైదరాబాద్ కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. ఇప్పటి వరకు విద్యార్థులు మూడు కోర్స్ వర్క్లు చేస్తుండగా, ఇక నుంచి నాలుగు చేయాల్సి ఉంటుందని తెలిపింది. యూజీసీ గుర్తింపు పొందిన పబ్లికేషన్స్లో ప్రచురితమైన ఆర్టికల్స్ను మాత్రమే పీహెచ్డీకి పరిగణనలోకి తీసుకొంటామని జేఎన్టీయూ హైదరాబాద్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ విజయ్కుమార్రెడ్డి తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి పీహెచ్డీ మార్గదర్శకాలను బుధవారం వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి విడుదల చేశారు. పీహెచ్డీ విద్యార్థుల హాజరును తప్పనిసరి చేశారు. ఆరేండ్లలో పీహెచ్డీ పూర్తి చేయాలి. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఏడాది సడలింపు ఇస్తారు. 2021-22లో పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ కలిపి 2021-22 242 మందికి పీహెచ్డీ అడ్మిషన్లు ఇచ్చారు.