హైదరాబాద్ : జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలో పలు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. బీటెక్, బీ ఫార్మసీ నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు, మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ సెకండ్ మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వాయిదా పడ్డ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. జులై 21 నుంచి జరగాల్సిన పరీక్షలు యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేశారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు మరో మూడు రోజుల పాటు సెలవులు పొడిగించిన విషయం విదితమే. ఈ నెల 16 వరకు సెలవులు ప్రకటించారు. 18న విద్యాసంస్థలు పున:ప్రారంభం కానున్నాయి.