హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాకు విద్యావకాశాలు కల్పించడంలో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ జిల్లాకు నూతనంగా జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీని మంజూరుచేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మంగవారం జీవో-67ను విడుదల చేశారు. కోర్సులు, సిబ్బంది, బడ్జెట్ కేటాయింపులపై త్వరలో ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేస్తామని పేర్కొన్నారు.