జోగులాంబ గద్వాల : మహబూబ్నగర్ పార్లమెంట్(Mahabubnagar Parliament) సీటుపై మాజీ పార్లమెంట్ సభ్యుడు జితేందర్ రెడ్డి(Jitender Reddy) హాట్ కామెంట్స్ చేశారు. మంగళవారం ఒక ప్రైవేటు ఫంక్షన్ సమావేశానికి హాజరైన అనంతరం ఆయన గద్వాలలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యుడిగా బరిలో ఉండేది నేనే.. గెలిచేది నేనే అంటూ వివరాలు వెల్లడించారు. జితేందర్రెడ్డి హాట్ కామెంట్స్ పై మరో నేత భవితవ్యం ప్రశ్నర్ధకంగా మారినట్లయింది. ఇప్పటికే పలువురు ఆశావాహులు తమ ప్రయత్నాలు మొదలు పెట్టగా నేడు జితేందర్ రెడ్డి ప్రకటనతో పాలమూరు బీజేపీ రాజకీయాలు రసకందాయంలో పడినట్లయింది.