హైదరాబాద్ : జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ హైదరాబాద్కు చేరుకున్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో సీఎం హేమంత్ సోరెన్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాలు, కేంద్రం విధానాలు, ఇతర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
ఈ ఏడాది మార్చి 4వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ జార్ఖండ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన తండ్రి శిబూ సోరెన్తో కేసీఆర్ సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించిన సంగతి తెలిసిందే.