హైదరాబాద్ : అబిడ్స్లోని అరోరా ఇంజినీరింగ్ కాలేజీ వద్ద జేఈఈ మెయిన్స్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. అంతేకాకుండా ఆ సెషన్లో నిర్వహించిన పరీక్షలో 26 ప్రశ్నలు డిస్ప్లే కాలేదు. ఇక మధ్యాహ్నాం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్షకు విద్యార్థులను అరోరా కాలేజీ సిబ్బంది అనుమతించలేదు.
ఈ రెండు పరిణామాలపై బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలపై కాలేజీ సిబ్బందిని ప్రశ్నిస్తే.. సర్వర్ డౌన్, టెక్నికల్ ప్రాబ్లమ్ అని చెబుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. తక్షణమే సరైన పద్ధతిలో ఎగ్జామ్ నిర్వహించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.