హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు ఆదివారం జరగనున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ -1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఆన్లైన్లో నిర్వహించే పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాకేంద్రాల్లో పరీక్ష సెంటర్లను ఏర్పాటుచేశారు. తెలంగాణ నుంచి 14 వేల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
మాస్కు పెట్టుకుంటేనే పరీక్ష కేంద్రంలోకి..