హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలను రాష్ట్రంలోని 13 పట్టణాల్లో నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది మే 26న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లల్లో పరీక్షలు జరుగుతాయి. ఇటీవలే పరీక్షలను నిర్వహించే పట్టణాల జాబితాను ఐఐటీ మద్రాసు వెల్లడించింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్నగర్, నల్లగొండ, నిజామాబాద్, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్లలో పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఐఐటీ మద్రాసు తెలిపింది.