హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఎనిమిదేండ్ల అతి స్వల్ప కాలంలోనే అసాధారణ ప్రగతి సాధించిందని ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి తనయుడు, జనతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమిత్ జోగి అన్నారు. బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో ప్రగతిభవన్లో ఆయన భేటీ అయ్యారు. ఇరువురు నేతలు తెలంగాణ అభివృద్ధి, దేశంలోని రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. బీఆర్ఎస్ విధివిధానాలపై ఆసక్తి కనబర్చిన అమిత్ జోగి, వివిధ అంశాలను సీఎం కేసీఆర్ను అడిగి తెలుసుకొన్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల అవసరం ఎంతో ఉన్నదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపనను ఆహ్వానించారు. అనతికాలంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారని కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధిలో దేశంలో తెలంగాణను ముందు వరుసలో నిలిపేందుకు ఎంతగానో కృషిచేశారని అభినందించారు. ఈ సందర్భంగా అజిత్జోగి ఆత్మకథ పుస్తకాన్ని కేసీఆర్కు బహూకరించారు. జనతా కాంగ్రెస్ పార్టీకి ఛత్తీస్గఢ్లో ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు.