సత్తుపల్లి టౌన్, నవంబర్ 19: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని పాత సెంటర్ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు సహకారంతో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ కాంస్య విగ్రహాన్ని రాజ్యసభ సభ్యుడు, హెటిరో డ్రగ్స్ చైర్మన్ బండి పార్థసారథిరెడ్డి శనివారం ఆవిష్కరించారు. పాఠశాలలో ప్రభుత్వం నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. పాఠశాలకు ల్యాప్టాప్, పాఠశాల వెల్ఫేర్కు రూ.50 వేల నగదు, ప్రాథమికోన్నత పాఠశాలకు కంప్యూటర్ అందజేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తదితరులు పాల్గొన్నారు.