యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, పాతగుట్ట పూర్వగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలలో ఈ నెల 23న ప్రారంభమైన నృసింహుడి జయంతి ఉత్సవాలు మంగళవారం రాత్రి నృసింహా ఆవిర్భావంతో ముగియ నున్నాయి. చివరి రోజైన మంగళవారం ఉదయం 7 గంటలకు ఆలయంలో స్వామివారి సహస్ర ఘటాభిషేకం జరిపారు. సాయంత్రం 7 గంటలకు ఆలయంలో అర్చకులు శ్రీ నృసింహా జయంతి జరిపి, ఆవిర్భావ నివేదన, తీర్థ ప్రసాద గోష్టి చేపట్టి ఉత్సవాలకు ముగింపు పలికారు.
సెకండ్ వే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ తో ఉత్సవాలను ఆలయంలొనే ఆస్థానపరంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ గీత, అనువంశిక ధర్మకర్త నరసింహా మూర్తి, ప్రధానార్చకులు నల్లంతీగళ్ లక్ష్మీ నరసింహా చార్యులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనాకు మనో ధైర్యమే మందు : ఎమ్మెల్యే చల్లా
ధాన్యం నిల్వల కోసం ప్రభుత్వ భవనాలను వినియోగించండి
ఆన్లైన్ బ్యాంకింగ్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
కాశయ్య మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం