Janasena | తెలంగాణలో తొలిసారి పోటీచేసిన పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన (Janasena) ఘోర పరాభవం చవిచూసింది. పోటీచేసిన అన్నిస్థానాల్లోనూ గ్లాస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. కూకట్పల్లి, తాండూరు, కొత్తగూడెంలో జనసేనాని స్వయంగా ప్రచారం చేశారు. అయినప్పటికీ ఆ పార్టీ కనీసం పోటీలో నిల్వలేకపోయింది. బీజేపీతో పొత్తుపెట్టుకున్న జనసేన.. ఎనిమిది స్థానాల్లో పోటీచేసింది. ఈ అన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులు కనీసం డిపాజిట్లు దక్కించుకోలేకపోయారు.
ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట, కూకట్పల్లి, తాండూరు, కోదాడ, నాగర్కర్నూలు నియోజకవర్గాల్లో జనసేన పోటీచేసింది. ఇక బీజేపీ 88 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. ప్రధాని మోదీ, అమిత్ షా సహా ఆ పార్టీ అతిరథ మహారథులు ప్రచారం చేసినప్పటికీ ఆ పార్టీ అపజయం మూటగట్టుకున్నది. బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్ కూడా ఓటమి బాటలో పయణిస్తున్నారు.