TSPSC | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవికి జనార్దన్రెడ్డి సోమవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ను కలిసి అందజేశారు. రాజీనామాకు ముందు ఆయన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశారు. రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. తదుపరి చర్యలు చేపట్టాలని సీఎస్కు గవర్నర్ లేఖ రాశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్గా జనార్దన్రెడ్డిని 2021లో అప్పటి ప్రభుత్వం నియమించింది.
జనార్దన్రెడ్డి 1996కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో పలు కీలక పోస్టుల్లో పని చేశారు. ఆయన స్వస్థలం మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దాయపల్లి. ఆయన అగ్రికల్చర్ పీజీ చేశారు. 1990లో గ్రూప్-1కు ఎంపికై డిప్యూటీ కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి ఏపీలో నల్లగొండ, నెల్లూరు ఆర్డీవోగా సేవలందించారు. వరంగల్, అనంతపురం జిల్లాల కలెక్టర్గా విధులు పని చేశారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, మార్కెటింగ్ శాఖల కమిషనర్గా, సహకారశాఖ రిజిస్ట్రార్గా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్గా, విద్యాశాఖ కార్యదర్శిగా, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. 2021 మేలో అప్పటి ప్రభుత్వం ఆయనను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా నియమించింది.