నల్లగొండ : నల్లగొండ పర్యటనకు బయలుదేరిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు జిల్లా పరిధిలో ఘన స్వాగతం లభించింది. జిల్లాలోకి ప్రవేశించిన కేటీఆర్కు చిట్యాలలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో రెండు వేల బైక్ లతో కార్యకర్తలు స్వాగతం పలికారు.
అక్కడి నుంచి నార్కట్ పల్లి మండల పరిధిలోని ఎల్లారెడ్డిగూడెం వరకు కేటీఆర్ ను తోడ్కొని వచ్చారు. అనంతరం ఎంజీ యూనివర్సిటీ వద్ద నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీగా బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు.
అక్కడి నుంచి నల్లగొండ పట్టణంలోని పాలిటెక్నిక్ కాలేజీ వరకు ర్యాలీగా కేటీఆర్ను తీసుకువచ్చారు. అన్ని చోట్ల కేటీఆర్ పార్టీ కార్యకర్తలు శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అంతకు ముందు చౌటుప్పల్ లోను టీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్కు స్వాగతం పలికారు.