హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లోని దిగువ సీలేరు జల విద్యుత్తు కేంద్రం సామర్థ్యాన్ని మరో 230 మెగావాట్లు పెంచేందుకుగాను పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటూ ఏపీ జెన్కో పంపిన ప్రతిపాదనలను కేంద్ర పర్యావరణ, అటవీశాఖ పరిధిలోని నిపుణుల కమిటీ (ఈఏసీ-ఎక్స్పర్ట్స్ అప్రయిజల్ కమిటీ) తిరస్కరించింది.
ఈ ప్రతిపాదనలు నిపుణుల కమిటీ పేర్కొన్న నిబంధనలు, సూచనలకు అనుగుణంగా లేవని స్ప ష్టం చేసింది. నిబంధనలకు అనుగుణం గా పర్యావరణ, అటవీ, సామాజిక, ఆర్థి క ప్రభావాన్ని, ముఖ్యంగా మత్స్య సం పదకు వాటిల్లే ప్రమాదాన్ని సరిగా అంచనావేయలేకపోయిందని పేర్కొన్నది.