హైదరాబాద్, మే23 (నమస్తే తెలంగాణ): ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడివా? లేదంటే కులసంఘం అధ్యక్షుడివా అంటూ ఎంపీ రేవంత్రెడ్డిపై రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ మండిపడ్డారు. కొడంగల్లో ఇటీవల నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాట్లాడిన తీరును జాజుల శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో ఖండించారు. రచ్చబండ కార్యక్రమంలో రైతుల గురించి మాట్లాడకుండా రెడ్లకు పగ్గాలు ఇవ్వాలని ఒక కులాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇదే తరహాలో గతంలోనూ మాట్లాడారని, దానిని బట్టి రేవంత్రెడ్డికి రెడ్డి కుల పిచ్చి ఎంతగా ఉందో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అర్థంచేసుకోవాలని కోరారు. కాంగ్రెస్లో జెండాలు మోసేది, ఓట్లు వేసేది, జిందాబాద్లు కొట్టేది 90% పైగా బహుజనులేనని తెలిపారు.