జగిత్యాల రూరల్, ఆగస్టు 24: మద్యం మత్తులో వృద్ధురాలిని బైక్తో ఢీకొట్టిన ఓ యువకుడు ఆపై ఆమె మృతదేహాన్ని కాలు వలో పడేసి పరారయ్యాడు. జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ శివారులో జరిగిన ఈ ఘటనను 24 గంటల్లోగా ఛే దించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చే శారు. జగిత్యాలలోని ఇస్లాంపూర్కు చెంది న మహ్మద్ సమియుద్దీన్ శనివారం మ ధ్యాహ్నం పొలాస గ్రామానికి బైక్పై పని మీద వెళ్లాడు.
స్నేహితుడితో కలిసి రాత్రి వరకు మద్యం తాగాడు. తెల్లవారుజామున 4 గంటలకు మద్యం మత్తులో జగిత్యాలకు వెళ్తుండగా తిమ్మాపూర్ శివారు లో బడుగు దుబ్బరాజు(60)ను ఢీకొట్టగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భయంతో ఆమె మృతదేహాన్ని కెనాల్లో పడేసి పరారయ్యాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో ఉన్న బైక్ నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించి ఆదివారం అదుపులోకి తీసుకోగా, నేరాన్ని అంగీకరించాడు. సమియుద్దీన్ను కోర్టులో హాజరుపర్చగా 14రోజులపాటు రిమాండ్కు తరలిం చినట్టు పోలీసులు పేర్కొన్నారు.