హైదరాబాద్: జగిత్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మహారాష్ట్రని ముంబైలో కిడ్నాప్కు గురయ్యాడు. జగిత్యాల జిల్లా నందగిరికి చెందిన శంకరయ్య.. గత నెల 22న దుబాయ్ నుంచి ముంబైకి వచ్చాడు. విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న క్రమంలో దుండగులు ఆయనను అపహరించారు. కిడ్నాపర్లు తాళ్లతో కట్టేసి ఉంచిన శంకరయ్య ఫొటోలను ఆయన కుటుంబ సభ్యులకు పంపించారు.
రూ.15 లక్షలు ఇస్తేనే వదిలేస్తామని డిమాండ్ చేశారు. దీంతో అప్పటి నుంచి ఆయన కిడ్నాపర్ల చెరలోనే ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శంకరయ్య ఆచూకీ కోసం గాలిస్తున్నారు.