నిర్మల్ : దళితుల అభ్యున్నతికి ఆహర్నిశలు కృషి చేసిన బాబూ జగ్జీవన్ రామ్(Jagjeevan Ram) ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర అటవి శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి(Minister Indrakaran Reddy) పిలుపునిచ్చారు. నిర్మల్(Nirmal) జిల్లా కేంద్రంలో జయంతి వేడుకల సందర్భంగా జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించి మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతి కోసం పాటు పడ్డారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న అవకాశాలు ఉపయోగించుకున్నప్పుడే జగజ్జీవన్ రామ్ ఆశయాలు నెరవేరతాయని ఆయన సూచించారు. అణగారిన వర్గాల(downtrodden sections) అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు.