హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏం కావా లో ప్రశ్నించకుండా, ప్రధాని మోదీని సీఎం జగన్ ప్రాధేయపడుతున్నారని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించా రు. విశాఖ ప్రత్యేక రైల్వేజోన్, పోలవరం ప్రా జెక్టు, విభజన చట్టం, ప్రత్యేక హోదాపై ప్రధాని కనీసం వివరణ ఇవ్వలేదన్నారు. రాష్ట్ర సమస్య ల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడగాల్సిన బాధ్యత మిత్ర పార్టీగా పవన్కల్యాణ్కు ఉన్నదని శనివారం ఆయన పేర్కొన్నారు.