సూర్యాపేట, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ)/సూర్యాపేట టౌన్: కాంగ్రెస్ పార్టీ ఎన్ని సార్లు మార్చినా అది ప్రజల దృష్టిలో 420 మ్యానిఫెస్టోనే తప్ప మరోటి కాదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయా సంఘాలు, మహిళలు, యువకులు బీఆర్ఎస్కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలతోపాటు మీడియాతోనూ మంత్రి మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ ఎంత? ఆదాయ వనరులు ఏమిటి? పథకాలు అమలు చేస్తే అయ్యే ఖర్చు ఎంత? అనే విషయాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా, ఎలాగైనా అధికారంలోకి రావాలనే దురాశతో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను రూపొందించిందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ కూటమిని ప్రజలు దోపిడీ దొంగల ముఠాగా భావిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని ఉత్తమ్, కోమటిరెడ్డి, జానారెడ్డి వంటి వృద్ధ నాయకులను ఈ ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా ఓడించబోతున్నారని జోస్యం చెప్పారు. కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణకు తిరుగులేదని అన్నారు. అనం తరం జన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు తగుళ్ల జనార్దన్, ఐఎన్టీయూసీ రాష్ట్ర నా యకుడు బంటు చొక్కయ్యతోపాటు 250 మంది అనుచరులు, అలాగే బొల్లె అక్షయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్ఎస్యూఐ, ఏబీ వీపీలకు చెందిన 630 మంది యువకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.