సూర్యాపేట, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్కు పాలనపై అవగాహన లేదని, పూటకో మోసం, రోజుకో అవినీతితో రాష్ట్రం పరువు పోతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సూర్యాపేటలోని 4,7,15,17 వార్డుల్లో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు.
ఆయా వార్డుల్లో పెద్దఎత్తున కాంగ్రెస్, బీజేపీ, ఇ తర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే రేవంత్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడని, అడ్డగోలుగా బూతులు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచకపాలన నడుస్తున్నదని, అందుకే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.