హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి, తుంగతుర్తి, ఆలేరు మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గాదరి కిశోర్, గొంగిడి సునీతామహేందర్రెడ్డి శుక్రవారం ఎర్రవెల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రజతోత్సవాల నిర్వహణ, వరంగల్ బహిరంగ సభ తదితర అంశాలపై వారికి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. త్వరలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిగిలిన ఎనిమిది నియోజకవర్గాల ముఖ్యనేతలతో సమావేశం ఉండనున్నట్టు తెలిపారు.