హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : టర్న్కీ కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ టర్న్కీ కాంట్రాక్టర్స్ జేఏసీ కోరింది. శుక్రవారం టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వీ పాటిల్ను కలిసి జేఏసీ నేతలు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. సమస్యలు అధికమవుతున్నాయని, ఇబ్బందులు తొలగించాలని కోరారు. అంశాలను లేఖ రూపంలో సమర్పించాలని సీఎండీ కాంట్రాక్టర్లకు సూచించారు. ఆయా అంశాలపై తగిన పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. జేఏసీ చైర్మన్ కందుకూరి శ్రీనివాస్, కో చైర్మన్ జీసీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆధార్ మిస్మ్యాచ్ అయిన టీచర్ల వేతనాలు చెల్లించాలి: యూటీఎఫ్
హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : ఆధార్ మిస్ మ్యాచ్ అయిన టీచర్ల ఫిబ్రవరి వేతనాలు చెల్లించాలని టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ చేసింది. 221 మందికి ఫిబ్రవరి నెల వేతనాలు నిలిపివేశారని, తక్షణమే విడుదల చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి, ప్రధాన కార్యదర్శి ఏ వెంకట్ కోరారు.
ప్రభుత్వ విద్యను నాశనం చేసేందుకు కుట్ర: పీటీఏ టీజీ
హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ విద్యను, విద్యాసంస్థలను నాశనం చేసేందుకు సర్కార్ కుట్రపన్నతున్నదని ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ (పీటీఏ టీజీ) రాష్ట్ర అధ్యక్షుడు కే మల్లికార్జున్రెడ్డి ఆరోపించారు. విద్యాకమిషన్, కేశవరావు కమిటీల వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అని అభిప్రాయపడ్డారు. ప్రాథమిక విద్యపై కుట్ర జరుగుతున్నదని, ఈ కుట్రలను టీచర్లు, ఉపాధ్యాయ సంఘాలు నిలదీయాలని పిలుపునిచ్చారు.