రవీంద్రభారతి, ఫిబ్రవరి 22 : ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించేలా సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశాల్లో చర్చించాలని మాల సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో మీడియా సమావేశంలో మాల సంఘాల ఐకాస చైర్మన్ మందాల భాస్కర్ మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ సవరణ బిల్లు ప్రెవేశపెట్టాలని డిమాండ్ చేశారు. వర్గీకరణతో మాల సామాజికవర్గం విద్య, ఉద్యోగాల్లో తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.
మాలలకు 2% రిజర్వేషన్లు వచ్చేలా రోస్టర్ పాయింట్లను పునఃసమీక్షించి కొత్త చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ‘మాలల పంతం.. కాంగ్రెస్ అంతం’ నినాదంతో కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తామని గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్ హెచ్చరించారు. రోస్టర్ విధానాన్ని మంత్రి వర్గంలోనే చర్చించి అసెంబ్లీలో చట్టం చేయకపోతే రాష్ర్టాన్ని అగ్నిగుండంగా మారుస్తామని పేర్కొన్నారు. సమావేశంలో మాల సంఘాల గౌరవ చైర్మన్ చెరుకు రాంచందర్ పాల్గొన్నారు.