హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : పోలీస్ శాఖలోని అన్ని విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు తక్షణమే 20 వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీస్ ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో భారీగా నిరసనలకు పిలుపు ఇచ్చినట్టు జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ఈనెల 10న నిర్వహించే భారీ నిరసన ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్ శనివారం ఆవిష్కరించా రు.
పోలీస్ నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఈనెల 10న దిల్సుఖ్నగర్లో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని మరో మిలియన్ మార్చ్లాగా నిర్వహిస్తున్నామని, అన్ని జిల్లాల నుంచి పోలీ స్ ఉద్యోగాల నిరుద్యోగులు తరలిరావాలని పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 23 నెలలవుతున్నా ఒక పోలీస్ ఉద్యోగం భర్తీ చేయలేదని విమర్శించారు.
కేసీఆర్ హయాంలో 2022 లో ఇచ్చిన నోటిఫికేషన్ మినహా.. ఇంతవరకు ఒక్క పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తే నిరుద్యోగుల ఆక్రోశానికి బలి అవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆకాశ్, శంకర్, వంశీ, నవీన్ పట్నాయక్, శింబునాయక్ ఉన్నారు.