హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఓబీసీ జాతీయ మహాసభను ఆగస్టు 7వ తేదీన నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జే శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఆదివారం మహాసభకు చెందిన వాల్పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు.
11వ జాతీయ ఓబీసీ సభను బెంగళూరులోని మన్మోహన్ సింగ్ సిటీ యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. 29 రాష్ట్రాల నుంచి ఓబీసీ ప్రతినిధులు సభకు హాజరవుతారని తెలిపారు.