హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): పెరుగుతున్న పెట్రో ధరలు, పర్యావరణ ప్రతికూల పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఈవీ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. కంపెనీలు, వాహన కొనుగోలుదారులకు పెద్దఎత్తున సబ్సిడీలు ఇస్తున్నాయి. అయితే ఇటీవల ఎలక్ట్రిక్ బైక్స్ అగ్నిప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ర్టాల ప్రజలు ఈవీ టూవీలర్లపై ఏమనుకుంటున్నారో తెలుసుకొనేందుకు వే2న్యూస్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో.. ప్రతి ముగ్గురిలో ఇద్దరు రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తుందని చెప్పారు. అయితే, వరుస ప్రమాద ఘటనలతో ఎలక్ట్రిక్ బైక్స్ సురక్షితమేనా? అన్న సందేహాన్ని వెలిబుచ్చారు. ధర ఎక్కువగా ఉన్నదని, ఒకసారి చార్జి చేస్తే కనీసం 200 కిలోమీటర్ల దూరమైనా ప్రయాణించేలా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ, ఏపీ నుంచి 1,50,886 మంది సర్వేలో పాల్గొన్నారు. ఇందులో 92.5 శాతం మంది చిన్న నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు కాగా, మిగిలినవాళ్లు టైర్-1, టైర్-2 సిటీలకు చెందినవారున్నారు.
ఈవీ బైక్స్పై అభిప్రాయాలు ఇలా..