హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ గ్లాండ్ కెమికల్స్ కంపెనీపై ఆదాయపు పన్ను శాఖ మంగళవారం దాడులు చేసింది. రాయదుర్గం, మొయినాబాద్, కోకాపేటలోని కంపెనీ ఆపీసుల్లో, ఎండీ బీఎన్ మల్లేశ్వరరావు, మరో ఐదుగురు డైరెక్టర్ల ఇండ్లలో సోదాలు చేసింది. ఆదాయ పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో కంపెనీ ఎండీ బీఎన్ మల్లేశ్వరరావు, మరో ఐదుగురు డైరెక్టర్లు, ఆయన బంధువుల ఇండ్లపై సోదాలు చేసింది.