హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా వచ్చే రెండ్రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3.1 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. అక్టోబర్ మొదటి వారం వరకు వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇప్పటిరకు వరకు తెలంగాణలోని రెండు జిల్లాల్లో రికార్డు స్థాయిలోఅత్యధిక వర్షపాతం నమోదైందని చెప్పారు. 9 జిల్లాల్లో అధిక వర్షపాతం, 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 8 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని వెల్లడించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పలు రాష్ర్టాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో, రెడ్ అలర్ట్ను జారీ చేసింది.