హైదరాబాద్: మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ (Gaddam Vivek) ఇళ్ల, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు (IT Raids) నిర్వహించారు. హైదరాబాద్ సోమాజిగూడతోపాటు మంచిర్యాలలోని నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. వివేక్ బంధువుల ఇండ్లలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దమొత్తంలో డబ్బు పంచుతున్నారని వివేక్పై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ నెల 15న ఆయనకు చెందిన కంపెనీ ఉద్యోగులు చెన్నూరుకు రూ.50 లక్షలు తరలిస్తూ హైదరాబాద్ రామంతాపూర్లో పట్టుబడిన విషయం తెలిసిందే.
ఇక, వివేక్ కంపెనీ నుంచి నుంచి మ్యాన్పవర్ కంపెనీకి బదిలీ అయిన రూ.8 కోట్ల నగదును అధికారులు ఫ్రీజ్ చేశారు. ఈ నెల 13న ఉదయం 10.57 గంటలకు బేగంపేటలోని హెచ్డీఎఫ్సీ బ్రాంచ్లోని విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ఒక ఖాతా నుంచి బషీర్బాగ్లోని ఐడీబీఐ బ్యాంకుశాఖలోని విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాలోకి (ఖాతా నంబర్ 0142003072600) రూ.8 కోట్ల నగదు బదిలీ అయినట్టు ఎన్నికల అధికారులకు సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ఆదేశాలతో ఆ ఖాతాలో జమైన అనుమానాస్పద రూ.8 కోట్ల నగదును బ్యాంకు అధికారులు ఫ్రీజ్ చేశారు.
Vivek
Vivek 1