హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ మోడల్’ పుస్తకం తమ ప్రభుత్వం సాధించిన విజయ పరంపరకు అక్షర చిహ్నమని మంత్రి కే తారకరామారావు చెప్పారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువరించిన తెలంగాణ మోడల్ పుస్తకాన్ని ఆదివారం ప్రగతిభవన్లోని కేటీఆర్ కార్యాలయంలో కేటీఆర్ ఆవిషరించారు. ఇది తమ ప్రభుత్వం సాధించిన నేటి విజయమే కాదు, రేపటి విజయాలకు దిక్సూచి అని చెప్పారు. సీఎం కేసీఆర్ దార్శనిక ఆలోచనలతో ప్రవేశపెట్టిన పథకాలు నేడు దేశానికి ఎలా నమూనా అయ్యాయో ఈ పుస్తకంలో గౌరీశంకర్ పొందుపరిచారని కేటీఆర్ చెప్పారు. ‘టుడే ఏ రీడర్, టుమారో ఏ లీడర్’ అంటారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ సామర్థ్యానికి, దక్షతకు, నిబద్ధతకు నిలువుటద్దం ఈ పుస్తకంలోని ప్రతి పేజీ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పుస్తక రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, నవలా రచయిత పెద్దింటి అశోక్కుమార్, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
‘నడక’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
తెలంగాణ వికాస సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలన్నీ కలిపి తీసుకొచ్చిన ‘నడక’ పుస్తకాన్ని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ ఆదివారం ఆవిషరించారు. ఈ పుస్తకం ద్వారా దశాబ్ద కాల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని విశ్లేషించిన తీరును మంత్రి అభినందించారు. దేశ, రాష్ట్ర సామాజిక స్థితిగతులపై ఈ పుస్తకంలో చకగా విశ్లేషించారని, కాలానుగుణంగా రాసిన ఈ వ్యాసాలన్నీ తెలంగాణకు సందర్భోచితంగా ఉన్నాయని ప్రశంసించారు. కార్యక్రమంలో ప్రముఖ పాత్రికేయుడు పరాంకుశం వేణుగోపాలస్వామి, సీనియర్ జర్నలిస్ట్ ఆసరి రాజు తదితరులు పాల్గొన్నారు.