కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 9 : తెలంగాణ చిహ్నంలో మార్పులు చేస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడటం సరికాదని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. తెలంగాణ చరిత్రను కనుమరుగు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. శుక్రవారం రాత్రి కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ చిహ్నంలో 800 ఏండ్ల చరిత్ర కలిగిన కాకతీయ తోరణం, చార్మినార్ చిహ్నాలు ఉన్నాయని తెలిపారు. అయితే, క్యాబినెట్లో తీర్మానం చేసి ఈ చిహ్నం తొలగిస్తామని, రాచరిక పోకడలకు సూచిక లెక ఉన్నదని మాట్లాడటం పద్ధతి కాదని సూచించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అశోక చక్రం ఉన్న మూడు సింహాలతో భారత ప్రభుత్వ చిహ్నం రూపొందించారని, మరి ఇది రాచరిక పాలనకు సంకేతమా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికీ సీమాంధ్ర పాలకుల మైకంలోనే ఉన్నారనే అర్థం అవుతుందని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేస్తామని కూడా మాట్లాడటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. పేర్లు మార్చడం కాదు.. ప్రజలకు ఏం చేయబోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.